వికలాంగులకు ట్రై సైకిల్స్ ని అందజేసిన పంతం నానాజీ

కాకినాడ రూరల్: జనసేనపార్టీ ఆధ్వర్యంలో.. తదేకం ఫౌండేషన్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన 3 ట్రై సైకిల్స్ ని జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ, తదేకం ఫౌండేషన్ ప్రతినిధులు శ్రీమతి మాధవి, శ్రీమతి సుధ తూరంగి గ్రామంలోని పగడాల పేట ప్రాంతంలోని వికలాంగులకు అందజేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో తూరంగి గ్రామ జనసైనికులు, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు.