జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన పంతం నానాజీ

పెడన: మార్చి 14వ తేదీన మచిలీపట్నంలో జరపబోయే జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని పెడన నియోజకవర్గానికి చెందిన నిలిపూడి, ఊర్లగొండి తిప్ప, చిన్నగొల్లపాలెం, లక్ష్మి పురం, చేరుకుమిల్లి గ్రామాల్లో కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ విస్తృతంగా పర్యటించి, ఆయా గ్రామాల్లోని జనసేన నాయకులు, జనసైనికులతో సమావేశమై ఛలో మచిలీపట్నం పోస్టర్స్ ని ఆవిష్కరణ చేసి, గ్రామాల్లో ప్రచారం ఏవిధంగా చేయాలి, వివిధ విషయాలను తెలియ జేసారు.