క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు ట్రోఫీ అందజేసిన పంతం నానాజీ

కాకినాడ రూరల్ మండలం మధురనగర్ లో వారం రోజులుగా జరుగుతున్న రమేష్ & శ్రీనివాస్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా పాల్గొని విజేతలగా నిలిచిన బ్యాడ్ బాయ్స్ టీం కెప్టెన్ కళ్యాణ్ మణికి ట్రోఫీ అందించి, నగదు అందించి జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంటి గంగ రాజేష్, మల్లిపూడి ఈశ్వర్, సతీష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.