పార్వతీపురం మున్సిపాలిటీ 20వ వార్డ్ యువత జనసేన పార్టీలో చేరిక

🚩 యువత భవిష్యత్తు జనసేనతోనే సాధ్యం అనే నమ్మకంతోనే పార్టీలో జాయిన్ అవుతున్నట్టు తెలిపారు.

🚩 పార్వతీపురం నియోజకవర్గం జనసేన – తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్దిని గెలిపించుకోడానికి సిద్దంగా ఉన్నాం చెప్పారు.

🚩వార్డ్ లో ప్రజలకు రాజకీయ వాస్తవాలు తెలియజేయాలి అని సీనియర్ నాయకులు పిలుపునిచ్చారు.

పార్వతీపురం మున్సిపాలిటీ 20వ వార్డులో సుమారు 30 మంది యువకులు ఈరోజు జనసేన పార్టీ సీనియర్ నాయకులు చందక అనీల్, గొర్లి చంటి, రెడ్డి కరుణ, వగలపూడి నాని, గవర ఈశ్వరరావు మరియు రెడ్డి నాగరాజు ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. అనంతరం పార్టీ సీనియర్ నాయకులు చందక అనీల్ మాట్లాడుతూ 20వ వార్డు యువకులు జనసేన పార్టీలో చేరడం చాలా ఆనందంగా ఉందని అలాగే పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి రాష్ట్ర భవిష్యత్, యువత భవిష్యత్తు రెండు జనసేనాని వల్లే సాధ్యం అని నమ్మి ఈ యువకులు అందరూ జనసేన పార్టీలోకి వచ్చారు అని అన్నారు. యువతలో ఈ మార్పు రావడం అనేది మా అధినేత విజయమే అని చెప్పారు. అనంతరం మువతతో మాట్లాడుతూ ఈ రెండు నెలలు మన బాధ్యతని మనం నెరవేర్చాలి అని ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోవాళ్లతో, అలాగే ఇర్గుపోరుగు వాళ్ళతో, వార్డ్ ప్రజలతో వైసీపీ వాళ్ళు చేస్తున్నా మోసాలు, దోపిడీలు, ప్రస్తుత రాజకీయ వాస్తవాలు అలాగే జనసేనపార్టీ అధికారంలో వచ్చాక ఏం చేస్తుంది అనే విషయాలు తెలియజేయండి అని పిలుపునిచ్చారు. 20వ వార్డ్ యువకులు జి ప్రసాద్, కె మౌళి, టీ సుధాకర్, మురళి, బి అశోక్, జ ప్రవీణ్, జ తరుణ్, ఎ షణ్ముక్, లక్ష్మణ్ తేజ, వెంకీ, రాజు, పవన్, నూకరాజు, సాయి, శివుడు, మురళి, వాసు, నితిన్ తదితరులు పార్టీలో జాయిన్ అయ్యారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు, మా భవిష్యత్తు పవన్ కళ్యాణ్ వలన మాత్రమే సాధ్యం అని నమ్మి ఈరోజు జనసేనపార్టీలో జాయిన్ అయ్యాం అని చెప్పారు.