విజయ రాయుడుపాలెంలో జనం కోసం పవన్ -పవన్ కోసం మనం

కరప మండలం, విజయ రాయుడుపాలెం గ్రామంలో గ్రామ సీనియర్ నాయకులు కాకర్ల ధర్మయ్య, దావులురి సత్తిబాబు ఆధ్వర్యంలో జనం కోసం పవన్ -పవన్ కోసం మనం కార్యక్రమం ద్వారా ఇంటింటికి పాదయాత్ర చేస్తూ సమస్యలు తెలుసుకుంటూ ఉన్న జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ ఈ గ్రామంలో భాగంగా నానాజీ గారికి మంచి నీరు సరైన సమయానికి రావడం లేదని అధికారులకి చెప్పినా పట్టించుకోవడం లేదని, డ్రైనేజీ లు పారిశుధ్యం సరిగా లేదు, వీధి దీపాలు సరిగా వెలగడం లేదని, గ్రామ సమస్యలతో పాటు రైతులు కూడా తొలకరి పంట వేసిన దగ్గర నుండి సాగునీరు అందక పొలాలు బీడు భూములుగా తయారైనాయని రైతులు వాపోయారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, కరప మండల నాయకులు, కాకినాడ రూరల్ మండల నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.