జనం కోసం పవన్ – పవన్ కోసం మనం.. చిన కొత్తూరు గ్రామంలో పంతం నానాజీ పర్యటన

కాకినాడ రూరల్: కరప మండలం, చిన కొత్తూరు గ్రామంలో గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు అల్లు గంగాద్రి ఆధ్వర్యంలో జనం కోసం పవన్ -పవన్ కోసం మనం కార్యక్రమం ద్వారా జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ ఇంటింటికి పాదయాత్ర చేస్తూ సమస్యలు తెలుసుకున్నారు. ఈ గ్రామంలో పర్యటన చేస్తున్న నానాజీగారికి ప్రజలు తమ సమస్యలను తెలుపుతూ మంచి నీరు సరైన సమయానికి రావడం లేదని అధికారులకి చెప్పిన పట్టించుకోవడం లేదని, డ్రైనేజీ లు లేవని, వీధి దీపాలు సరిగా వెలగడం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్లు గంగాద్రి, చింత వెంకట్, బండారు మణికంఠ, రెడ్డి రాజు, సంజయ్, గోపి , బోగి బోగిరెడ్డి కొండబాబు, బండారు మురళి, గంగాధర్, యాళ్ల పండు, వెంకటేశ్వర్లు, రమణ, శిరంగు శ్రీనివాస్, తాటికాయల వీరబాబు, కరెడ్ల గోవింద్, రెడ్డిపల్లి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక జనసేన నాయకులు, కరప మండల నాయకులు, కాకినాడ రూరల్ మండల నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.