ప్రమాదంలో మరణించిన జనసైనికుడి కుటుంబసభ్యులను పరామర్శించిన పితాని

ముమ్మిడివరం: శుక్రవారం రాత్రి జరిగిన రోడ్ ప్రమాదంలో మరణించిన జనసేన క్రియాశీలక సభ్యుడు తాళ్లరేవు మండలం, రామన్నపాలెం గ్రామానికి చెందిన అగ్నికుల క్షత్రియ యువకుడు మల్లాడి నూకరాజు (27) బంధువులను కోరంగి పోలీస్ స్టేషన్ వద్ద జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా పితాని మాట్లాడుతూ జనసేన పార్టీ క్రియాశీలకభీమా 5 లక్షల రూపాయలు వీలైనంత తొందరగా అందించే ప్రయత్నం చేస్తానని చెప్పారు. అదేవిధంగా కోరంగి పోలీస్ స్టేషన్ ఎస్.ఐ. ని కలిసి బాధితుల కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. వారితో తాళ్లరేవు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు అత్తిలి బాబురావు, పితాని రాజు, మాదాల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.