పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కాంక్షిస్తూ కాశీలో అన్నదాన కార్యక్రమం

తాడేపల్లిగూడెం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరియు పార్టీ అభ్యర్థులు వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని.. మహా శివరాత్రి పర్వ దినమున శనివారం పవన్ కళ్యాణ్ రోబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ.. అలానే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసి (కాశీ) లో ఓంకారేశ్వరి నిత్య అన్నధాన సత్రంలో ప.గో.జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన నాయకులు & జిల్లా కాపు యువత అధ్యక్షులు అయిన మారిశెట్టి అజయ్ బాబు, సతీష్ బాబు & మారిశెట్టి అజయ్ బాబు యువసేన సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్య లో రెండు తెలుగు రాష్ట్రాల భక్తులు పాల్గొన్నారు. చేసిన ఏర్పాట్లను చూసి పలువురు భక్తులు ప్రశంసించడం జరిగింది.