రాష్ట్ర ప్రజల బ్రతుకుల్లో వెలుగులు నింపే నిజాయితీ కలిగిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్: కరిమజ్జి మల్లీశ్వారావు

ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం మండలం, నెలివాడ గ్రామంలో.. సోమవారం ఇంటింటికి జనసేన పార్టీ కార్యక్రమంలో భాగంగా.. గ్రామ ప్రజలను కలుసుకొని, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను, లక్ష్యాలను, పార్టీ సిద్ధాంతాలను, ప్రజలకు తెలియజేస్తూ.. చైతన్య పరుస్తున్న ఎచ్చెర్ల నియోజకవర్గ నేత, పి.ఏ.సి.ఎస్ మాజీ చైర్మన్ కరిమజ్జి మల్లీశ్వారావు, రాష్ట్ర ప్రజల బ్రతుకుల్లో వెలుగులు నింపే నిజాయితీ కలిగిన ఎకైక నాయకుడు కోనేదేల పవన్ కళ్యాణ్ అని అన్నారు, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీకి ఓట్లు వేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు, నేడు అధికారం లేకపోయినా సరే, తన సొంత కష్టార్జితంతో కోట్లాది రూపాయిలను ఇచ్చి ఆదుకుంటున్న గొప్ప మానవతావాది పవన్ కళ్యాణ్ అని అన్నారు. అటువంటి మహానేతను రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసి మన భవిష్యత్ తరాలకు మంచి నీతివంతమైన పాలన అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, తదితరులు పాల్గొన్నారు.