జనసేన పార్టీ స్టేట్ ప్రోగ్రామ్ కమిటీ సభ్యులతో పవన్ కళ్యాణ్ భేటీ

హైదరాబాద్: శనివారం హైదరాబాద్ సెంట్రల్ ఆఫీస్ నందు అక్టోబర్ లో ప్రాంభమయ్యే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ర్ట పర్యటన కోసం స్టేట్ ప్రోగ్రామ్ కమిటీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి.. పర్యటనకు హాజరయ్యే ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా వారిని ఏలా ప్రొటెక్ట్ చేసుకోవాలో.. దిశా నిర్దేశం చేస్తూ అందరి అభిప్రాయాలను జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తెలుసుకున్నారు. ఈ సమావేశం ప్రోగ్రామ్స్ కమిటీ రాష్ర్ట చైర్మన్ కె.కె గారి అధ్యక్షతన జరిగింది. అమలాపురం నియోజకవర్గానికి చెందిన రాష్ర్ట ప్రోగ్రామ్స్ కమిటీ కార్యదర్శి మహాదశ నాగేశ్వరరావు మరియు రాష్ట్ర నలుమూలల నుండి విచ్చేసిన కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.