సామాన్యుల బ్రతుకులు మార్చడానికి వచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్: మర్రాపు సురేష్

*కుంకుమ దిద్ది, హరతులతో నీరాజనాలు పలికిన సరైవలస గ్రామస్తులు

విజయనగరం జిల్లా, పల్లె పల్లెకు జనసేన పార్టీ కార్యక్రమంలో భాగంగా గజపతినగరం నియోజకవర్గం, దత్తిరాజేరు మండలం, సరైవలస గ్రామంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు మర్రాపు సురేష్ పర్యటించారు.

ప్రతీఇంటింటికి వెళ్లి జనసేన సిద్ధాంతాలతో కూడియున్న కరపత్రాలను పంచుతూ ప్రజలందరికి అధికారంలో లేకపోయినా పవన్ కళ్యాణ్ ప్రజలకు చేస్తున్న రైతు భరోసా సాయం, ప్రజల సమస్యలు తీర్చడానికి ప్రజావాణి కోసం మొదలగు సేవలను ప్రజలకు వివరించారు.

గ్రామస్తులు బొట్లు పెట్టి, హరతులతో జనసేన నాయకులకు నీరాజనాలు పలికారు. ఈ సందర్బంగా నాయకులు సురేష్ మాట్లాడుతూ మన బడుగు బలహీన వర్గాల జీవితాలను మార్చడానికి వచ్చిన నిస్వార్థ ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ అని, ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుతో ఈసారి నిజాయితీతో పార్టీ పెట్టిన జనసేన అభ్యార్థులకు వేసి గెలిపించిమని అభ్యర్థిస్తున్నామని, ఖచ్చితంగా రాష్ట్రంలో జెండా మారితే సామాన్యుల బతుకులు మారడం ఖాయమని అన్నారు.

కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు మిడతాన రవికుమార్, అప్పారావు, తిరుపతి, పండు, శ్రీను, హరీష్ నానీ, చలం, తదితరులు పాల్గొన్నారు.