మల్లయుద్ధ యోధులతో పవన్‌ కుస్తీ

ప్రాచీన మల్లయుద్ధాన్ని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలన్నారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌. ఆత్మరక్షణతో పాటు ఆత్మస్థైర్యాన్ని పెంచుకునేందుకు యువత ప్రయత్నించాలని ఆయన సూచించారు. తాను హీరోగా నటిస్తోన్న సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు యూపీ, హర్యానాల నుంచి వచ్చిన మల్లయోధులతో పవన్ కళ్యాణ్ కాసేపు సందడి చేశారు. వారితో పిచ్చాపాటీ మాట్లాడారు. ఈ సందర్భంగా వారంతా పవన్‌కల్యాణ్‌తో ఫొటోలు దిగి తమ అభిమానాన్ని చాటుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కీ.. జై.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ ఆనందాన్ని వెలిబుచ్చారు.