ప్రజల అందరి ఆశీస్సులతో పవనన్న ప్రభుత్వం స్థాపిస్తారు: యు.పి.రాజు

రాజాం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు ఉర్లాపు పోలరాజు (యు.పి.రాజు) ఆధ్వర్యంలో రెండువ రోజు ఇంటిఇంటికి జనసేన పార్టీ కార్యక్రమం రేగిడి ఆమదాలవలస మండలం అంబకండి గ్రామంలో చేపట్టారు. ప్రతి ఇంటికీ వెళ్ళిన యు.పి.రాజు ప్రజల సమస్యలను అధ్యయనం చేసి జనసేన పార్టీ తరుపున అండగా నిలబడతామని భరోసా కల్పించారు. ప్రజలు అందరు ఈసారి పవన్ కళ్యాణ్ కి అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, మణికంఠ, అప్పలనాయుడు, సాయి, లక్షమ్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.