ప్రజా సమస్యల పరిష్కారానికి కొనసాగుతున్న పవనన్న ప్రజాబాట

  • 57వ రోజుకు చేరిన పవనన్న ప్రజా బాట
  • ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత అంటున్న డాక్టర్ కందుల

విశాఖ సౌత్: ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. ఆయన ఆధ్వర్యంలో నియోజకవర్గంలో నిర్వహిస్తున్న పవనన్న ప్రజా బాటా కార్యక్రమం 57వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా పలు ప్రాంతాలలో ఆయన పర్యటించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తానని ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు తెలిపారు. ప్రజా సేవ చేసేందుకు తాను రాజకీయంలోకి వచ్చానని తన శ్వాస ఉన్నంతవరకు ప్రజా సేవకు అంకితం అవుతానని పేర్కొన్నారు. ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకుండా రాజకీయాలకు అతీతంగా ప్రజా సేవ చేస్తానని వెల్లడించారు.
కానీ చేపడుతున్న ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి వస్తున్న స్పందన పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు.పవనన్న ప్రజా బాటా కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వరిగల పాండు, టమట అప్పారావు, గాజుల శ్రీను, జానకి, కుమారి, వరద శ్రీను, దుర్గ, ప్రసాద్, మంగ తదితరులు పాల్గొన్నారు.