మీ పార్టీ కోసం పని చేస్తే మీ పార్టీ ఫండ్ నుండి జీతాలు ఇవ్వండి: దారం అనిత

మదనపల్లె, “సొమ్ము ప్రజలది సోకు ప్రభుత్వానిది” అన్నట్లు ఉంది మన రాష్ట్రంలో అధికార వైసీపీ ప్రభుత్వ తీరు. వాలంటీర్స్ విషయంలో వైసీపీ నాయకులు పరిధులు దాటి మాట్లాడుతున్నారు. విజయసాయి రెడ్డి మరియు హోంమంత్రి తానేటి వనిత పార్టీ కార్యకర్తలకే వాలంటీర్స్ పోస్ట్లు ఇచ్చాం అంటున్నారు. ఇక రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి వారైతే ఒక అడుగు ముందుకు వేసి వాలంటీర్స్ ను మనం ఇష్టమైన వారిని నియమించామని, పార్టీ కి వ్యతిరేకంగా ఉంటే తీసేస్తామని, పార్టీ కార్యకర్తలనీ, వాలంటీర్స్ ను గ్రిప్ లో ఉంచుకోమని తమ పార్టీ వారికి సలహాలు ఇస్తున్నారు. అంబటి రాంబాబు మీ పార్టీ కార్యకర్తలు, మీ పార్టీ కోసం పని చేస్తే మీ పార్టీ ఫండ్ నుండి జీతాలు ఇవ్వండి. ప్రజల ఖజానా నుండి జీతాలెందుకు ఇస్తున్నారు. దీనినే సొమ్ము ప్రజలది సోకు అధికార పార్టీది అంటారని చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత అన్నారు.