పలు కుటుంబాలను పరామర్శించిన పేడాడ
ఆమదాలవలస నియోజకవర్గం: ఆమదాలవలస మున్సిపాలిటీ, వెంగలరావు కాలనీకి చెందిన యువకుడు రాంసాయి అనారోగ్యం కారణంగా మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమదాలవలస నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ బుధవారం చనిపోయిన రాంసాయి ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. తమ కుటుంబానికి జనసేన పార్టీ ఏళ్ల వేళలా అండగా ఉంటుందని భరోసాని ఇవ్వడం జరిగింది. అనంతరం కశింవలస గ్రామంలో అనారోగ్యంతో చనిపోయిన వాకాడ సింకయ్య కుటుంబాన్ని కూడా పరామర్శించి వారి కుటుంబానికి భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమలో సరుబుజ్జిలి మండల అధ్యక్షులు పైడి మురళి మోహన్, టౌన్ జనసైనికులు, బగాది ఫణికుమార్, గంగు కోటేష్, సాగర్, తవిటి నాయుడు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-19-at-4.39.47-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-19-at-4.39.48-PM.jpeg)