రోడ్డు ప్రమాదానికి గురైన రొడ్డ శ్రీకాంత్ ని పరామర్శించిన శివకోటి యాదవ్

నర్సంపేట నియోజకవర్గం: ఖానాపూర్ మండల కేంద్రానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు రొడ్డ.శ్రీకాంత్ ఇటీవల ఖానాపురం గ్రామ శివారులోని నేషనల్ హైవే-365 రోడ్డుపైగల తుంగబంధం కాలువ బ్రిడ్జి వద్ద టూవీలర్ వాహనంపై పని మీద నర్సంపేటకు వస్తుండగా ఖానాపురం వైపు వెళ్తున్న బర్రెల మందలోని ఒక గేదే అనుకోకుండా ఒక్కసారిగా అడ్డు రావడంతో వాహనం అదుపుతప్పి శ్రీకాంత్ బైక్తో సహా కింద పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో శ్రీకాంత్ కు కుడి భుజం కంటే బొక్క విరిగి, కుడి మోచేయి, కుడి మోకాలు, కుడి పాదంపై గాయలవడంతో స్థానిక నర్సంపేటలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జీ మేరుగు శివ కోటి యాదవ్ మరియు జనసేన నాయకులు వంగ మధు, ఓర్సు రాజేందర్, బొబ్బ పృథ్వీరాజ్, గుండం రేవన్ లు శ్రీకాంత్ ని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని జాగ్రత్తలు చెప్పి అధైర్య పడవద్దని పార్టీ తనకు అండగా ఉంటుందని తెలియజేశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన శ్రీకాంత్ కు భార్య, అతి చిన్న వయసున్న ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. రొడ్డ శ్రీకాంత్ జనసేన పార్టీ ఖానాపూర్ మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ గా ఉన్నారు.