75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పెడన మండలం జనసేన

పెడన మండలం, భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా దేశం మొత్తం స్వాతంత్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంది.

ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం స్వాతంత్రం ఎందరో బలిదానాలతో సాధించుకున్న స్వాతంత్ర దినోత్సవాన్ని త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి మహనీయులను స్మరించుకోవడం భారతీయ పౌరుడుగా మన బాధ్యత.

స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పెడన మండలం, బల్లిపర్రు గ్రామంలో గ్రామస్తులు మరియు జనసేన ఆధ్వర్యంలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ఎస్ వి బాబు, ఓడుగు ప్రభాస్ రాజు, తిరుమల శెట్టి చంద్రమౌళి, కూనసాని నాగబాబు, తిరుమని రామాంజనేయులు, జయరాజ్, జోగి నాగ వరలక్ష్మి, వాసన నాగజ్యోతి, జోగి లక్ష్మీపార్వతి బత్తిన రమేష్, దాసరి గోపాలం, వాసన కుమారస్వామి, బత్తిన నరేష్, ఎర్రంశెట్టి వీరబాబు, పినిశెట్టి రాజు, బత్తిన మోహను కొక్కు రమేష్, పాశం నాగమల్లేశ్వరరావు, వాసుదేవ కృష్ణ భీమరాజు, కొప్పునేటి నరేష్, కొప్పునేటి శివమణి, పుప్పాల సూర్యనారాయణ, చిట్ల నవీన్ కృష్ణ మోటేపల్లి సురేష్ కునపురెడ్డి రంగయ్య యర్రంశెట్టి వీరబాబు, పోలగాని లక్ష్మీనారాయణ, ఊసా వెంకయ్య మరియు బల్లిపర్రు జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *