పెనికేరు గ్రామం శెట్టిబలిజ సీనియర్ వైసిపి నాయకులు జనసేనలో చేరిక

తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట నియోజక వర్గంలోని, ఆలమూరు మండలం, పెనికేరు గ్రామమునకు చెందిన ప్రముఖ శెట్టిబలిజ సీనియర్ నాయకులు, ఎక్స్ ఎంపిటిసి సభ్యులు, జనసేన పార్టీలోకి బండారు శ్రీనివాస్ నాయకత్వంలో శుక్రవారం చేరారు. వారి సమక్షంలో జనసేన పార్టీలో చేరి, పార్టీ జెండాను భుజస్కంధాలపై జనసేన నాయకులు బండారు శ్రీనివాస్ చేత ఎంతో సంతోషంగా కండువా వేయించుకున్నారు. ఈ మధ్యకాలంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశయాలను అన్నివర్గాల వారు ఆదరిస్తున్నారనీ, అనడానికి, ఇదే నిదర్శనమని, ప్రజల్లో మార్పు ప్రారంభం అయిందని, బండారు అన్నారు. మరీ ముఖ్యంగా జనసేన పార్టీ, శెట్టి బలిజ, బీసీ సోదరులకు, దళిత సోదరులకు, పెద్దపీట వేస్తుందని, మంచి ఉన్నత స్థానము కల్పిస్తుందని, ప్రతి ఒక్కరికి నమ్మకం కలిగిందని, పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు. జనసేనాని వైపు ప్రతి ఒక్కరూ, అన్ని వర్గాల వారు ఆకర్షితులు అవుతున్నారు, అనడానికి ఈ మధ్యకాలంలో కొత్తపేట నియోజకవర్గం నాలుగు మండలాల్లో అధిక సంఖ్యలో పెద్ద ఎత్తున యువత, గ్రామ నాయకులు, మండల నాయకులు, వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు తో పాటు, జనసేనపార్టీలోకి శెట్టి బలిజ, బీసీ, దళిత సోదరులు చేరినారు. ఈ సందర్భంగా పార్టీలోకి చేరిన ప్రముఖ శెట్టిబలిజ నాయకులు ఎక్స్ ఎం పి టి సి సభ్యులు శీలం రమణ, జుత్తుగ చందర్రావు, వల్లి వీరన్న, గెద్దాడ శ్రీనివాస్, కాండ్రేగుల మహేశ్వర రావు తదితరులు, వై ఎస్ ఆర్ సి పి పార్టీ నుండి జనసేన పార్టీ లోకి చేరి బండారు శ్రీనివాస్ కు అండగా నిలిచారు. వీరంతా జనసేనాని ఆశయాలు నచ్చి మెచ్చి, భవిష్యత్తు తరాలకు ఆశాజనకంగా ఉన్న గొప్ప నాయకుడు ఒక జనసేనాని పవన్కళ్యాణ్ మాత్రమేనని వారిని కొనియాడుతూ, కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి బండారు శ్రీనివాస్ నాయకత్వం అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు సాగుతుందని, అన్ని వర్గాల వారిని ఎంతో గౌరవ, మర్యాదలతో, పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నారని, జనసేన పార్టీని కొత్తపేట నియోజకవర్గంలో అంచలంచలుగా పూర్తిస్థాయిలో బలోపేతం చేసుకుంటూ, కులాలకు, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని ఎంతో ఆదరణతో ఆదరిస్తున్నారని ఈ సందర్భంగా పలువురు బండారు శ్రీనివాస్ నాయకత్వాన్ని కొనియాడారు. ఈ సందర్భంగా పార్టీలోకి చేరిన ప్రతి ఒక్కరికి కూడా బండారు శ్రీనివాస్ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసి, ప్రతి ఒక్కరికి ఎల్లవేళలా అండగా ఉంటానని, కష్టసుఖాలలో కూడా ఎప్పుడూ తోడుగా ఉంటామని, మీ అందరి వెన్నంటే నిలబడతానని, ఎవరిని కూడా మేము ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోబోమని, రేపటి తరానికి జనసేనానే గొప్ప నాయకుడు కాబోతున్నారని, జనసేన పార్టీ లోనికి, జనసేనానికి అండగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, పిలుపునిస్తూ ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నామని, ఈ చేరికలు సందర్భంగా ఎంతో సంతోషం ఆనందం వ్యక్తం చేస్తూ బండారు శ్రీనివాస్ ప్రెస్ వారికి తెలియజేశారు.