రైతులకు పెన్షన్ గొప్ప ఆలోచన.. రైతు దినోత్సవ వేడుకలలో వబ్బిన

ఎస్.కోట: రైతులకు పెన్షన్ ఇవ్వాలనే నిర్ణయం గొప్ప ఆలోచన అని ఎస్.కోట నియోజకవర్గ జనసేన నాయకులు వబ్బిన సత్యనారాయణ పేర్కొన్నారు. అందుకే గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చారని స్పష్టం చేశారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొత్తవలస మండలం ఉత్తరాపల్లి గ్రామంలో శుక్రవారం రైతు దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులను పార్టీ నాయకులు సత్కరించారు. గ్రామంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా వబ్బిన సత్యనారాయణ మాట్లాడుతూ ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు పవన్ కల్యాణ్ గారు 30 కోట్ల రూపాయలు అందిస్తున్నారని పేర్కొన్నారు. రైతు కుటుంబాల సంక్షేమంపై ఆయనకు ఉన్న నిబద్ధతకు ఈ సంఘటనే ఉదాహరణ అని స్పష్టం చేశారు. ఆకలి కేకలు, ఆత్మహత్యలు లేని రైతురాజ్యమే జనసేన లక్ష్యమని పేర్కొన్నారు. కొత్తవలస మండల జనసేన పార్టీ అధ్యక్షుడు నక్కరాజు సతీష్ మాట్లాడుతూ పాలకుల తీరుతో వ్యవసాయ రంగం కుదేలయిందన్నారు. ఆత్మహత్యలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా ప్రచార కమిటీ సభ్యులు పెదిరెడ్ల రాజశేఖర్, మల్లువలస శ్రీను మాట్లాడుతూ జనసేనతోనే రైతు శ్రేయోరాజ్యం సాధ్యమవుతుందన్నారు. అందుకు పవన్ కల్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్.కోట మండల అధ్యక్షుడు కొట్యాడ రామకోటి, పిల్లా రాం దుర్గ, తూరిబిల్లి విజయ్ కుమార్, గురజాడ వెంకటేష్, బోణి రామగణేష్, రామదాసు కాశి, తోట శ్రీను, బొబ్బరి నగేష్, పవర్ శ్రీను, రమేష్, బన్నీ, రాజేష్, వాసు, బాలాజీ, సింగంపల్లి ఎర్నిబాబు, పెనుమత్స సురేష్ రాజు, చిన్ని, కిరణ్, గోకాడ సూర్య, గొట్టివాడ రవి కుమార్, రుద్ర నాయుడు, సింగంపల్లి సతీష్, రెడ్డి కృష్ణ, కచ్చర్ల ఎర్నినాయుడు, పావడా వినయ్, ఎత్తుల బాగ్యరాజు, సింగంపల్లి జాను బాబు, జనసైనికులు పాల్గొన్నారు.