జనసేనాని త్వరగా కోలుకోవాలని బాబా కు పూజలు నిర్వహించిన పెనుగొండ జనసేన

పెనుగొండ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్యం క్షేమంగా ఉండాలని.. త్వరగా కోలుకొని.. ప్రజా సమస్యలపై నిరంతరము పోరాటం చేయాలని.. ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని గురువారం పెనుగొండ గ్రామంలోని షిరిడి సాయి బాబా మందిరంలో ప్రత్యేక అభిషేకం, గోత్రనామాలతో అష్టోత్తర పూజా కార్యక్రమం పూజా కార్యక్రమం మండల అధ్యక్షులు కంబాల బాబులు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కంబాల తరుణ్ సాయి, ఎంపీటీసీ అభ్యర్థిని మేకల చంద్రకుమారి, వీర మహిళ కొత్త కోటేశ్వరి, గుండు బోగులు నవీన్ (బన్నీ), మేకల సత్య, సంగినీటి మణికంఠ, పప్పు సోమేశ్వర రావు, వేపూరి మణికంట, శ్యామల సాయి, కంబాల సత్యనారాయణ, ఆకుల నరేష్ కంబాల పూర్ణ వెంకట బాలస్వామి, యోగేంద్ర (చిన్న)
తదితర జన సైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.