వైసిపి రాక్షస పాలనలో రాష్ట్ర ప్రజలు కష్టాల పాలు: షేక్ మహబూబ్ మస్తాన్

ఆత్మకూరు: రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వ రాక్షస పాలనతో రాష్ట్ర ప్రజలు కష్టాలు పడుతున్నారని ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు షేక్ మహబూబ్ మస్తాన్ పత్రికా ప్రకటననివ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో పలు నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తు ఫెక్సీలు ఏర్పాటు చేయడము ప్రభుత్వానికి చేతకానితనానికి నిదర్శనం అని అన్నారు. ముఖ్య మంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వంలో మద్యం, లిక్కర్, ఇసుక మైనింగ్, గ్రావెల్ మాఫియాతో పాటు హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. త్వరలో వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి రాష్ట్ర ప్రజలు చెప్తారని అన్నారు. పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తూ ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలను తొలగించని ఎడల జనసేన పార్టీ తరఫున నుంచి జగన్ రెడ్డిని కించపరిచే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తామని షేక్ మహబూబ్ మస్తాన్ వైసిపి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.