ప్రజాపాలనే జనసేన లక్ష్యం.. జనసేన పల్లేపోరులో బొలిశెట్టి శ్రీనివాస్

తాడేపల్లిగూడెం: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల గురించి ఆలోచించడం లేదని బొలిశెట్టి అన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం జట్లపాలెం గ్రామంలో బుధవారం జరిగిన జనసేన పల్లేపోరులో వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి నవరత్నాలు పేరు చెప్పి ప్రజలను మభ్యపెడుతుందన్నారు. నిత్యవసరాల సరుకుల మీద ఎన్నడూ లేని విధంగా రేట్లు పెంచి, ప్రజలు కట్టే టాక్స్ లతోనే నవరత్నాలు అందజేస్తుందన్నారు. అంతే కాకుండా సామాన్యుడు తిరిగే పెట్రోలు, గృహిణిలు ఉపయోగించే గ్యాస్ రేట్లు ఆకాశన్నంటాయన్నారు. ప్రజలు ఆలోచించి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి జనసేన పాలన అంటే ప్రజల పాలననే గెలిపించుకోవాలని శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం జనసేన పెంటపాడు మండల అధ్యక్షులు పుల్ల బాబీ, స్థానిక నాయకులు పెనుబోతుల సోమలమ్మ, కుదుళ్ళ శ్రీనివాస్, పెనుబోతుల బాలాజీ, నెల్లూరు బలరాజు, తూము దుర్గ ప్రసాద్, మర్రిపూడి కిరణ్, నమాల కిరణ్ తదితరులు మరియు తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన నాయకులు జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.