అగ్నిప్రమాద బాదితురాలికి అండగా నిలిచిన జనసైనికులు
గజపతినగరం నియోజకవర్గం: విజయనగరం జిల్లా, దత్తిరాజేరు మండలం, రాజుల రామచంచంద్రపురం గ్రామంలో అగ్నిప్రమాదంలో ఈది బిల్లి ఈశ్వరమ్మ ఇల్లు కాలిపోయింది. ఆమెకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందక బాదపడుతున్న బాధితురాలికి జనసేన నాయకులు ఒక రైస్ బ్యాగు, నిత్యవసర సరుకులు అందజేసి.. తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేయడం జరిగింది. లేని యడల జనసేన పార్టీ జనసైనికులు, నాయకులు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సహాయం అందించిన జనసైనికులు, జనసేన పార్టీ కార్యనిర్వాహ కమిటీ సభ్యులు మామిడి దుర్గాప్రసాద్ మరియు బొబ్బలి సూర్య నాయుడు, నడిపురి చరణ్, దేవరపల్లి సురేష్, కిక్కర భాస్కరరావు, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-19-at-9.21.51-PM-2.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-19-at-9.21.51-PM-3-1024x459.jpeg)