మూడు రాజధానుల గెజిట్ నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్
ఏపీ రాజధాని రైతు పరిరక్షణ సమితి కోర్టును ఆశ్రయించింది. మూడు రాజధానుల గెజిట్ నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు ఉత్తర్వులను కోర్టులో సవాల్ చేశారు.. జీఎన్రావు, హైపవర్ కమిటీ చట్ట విరుద్ధమని ప్రకటించాలని పిటిషనర్ కోరారు. రాజ్భవన్, సీఎం కార్యాలయం, సచివాలయాలను అమరావతి నుంచి తరలించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు విన్నవించారు. ఈ పిటిషన్పై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.