జీవో 429 పునరుద్ధరణ కోసం అనుశ్రీకి వినతిపత్రం

రాజమండ్రి సిటీ, బేసిక్ మెడికల్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి జీవో 429 పునరుద్ధరణ విషయం వినతిపత్రాన్ని రాజమండ్రి సిటీ జనసేన పార్టీ ఇంఛార్జి అనుశ్రీ సత్యనారాయణకి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరికి శ్రీనివాసరావు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు వైయస్ మూర్తి, ప్రధాన కార్యదర్శి మురళీధర్ కోశాధికారి శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు గారా ప్రసాద్, నగర అధ్యక్షులు శ్యామ్ చిట్టిబాబు, ఉపాధ్యక్షులు హరిదాసుల హరిబాబు, ప్రధాన కార్యదర్శి ఎమ్ సత్యనారాయణ, వంకా బాలకృష్ణ, బి.రమేష్, డాక్టర్ బాబు, శివకుమార్ పాల్గొనడం జరిగింది.