గోకవరాన్ని రాజమండ్రిలో కలపాలని 7000 సంతకాలతో వినతిపత్రం
తూర్పుగోదావరి, గత నెల జనవరి 26 తారీఖున జిల్లాల విభజనలో భాగంగా గోకవరం మండలాన్ని కాకినాడ జిల్లాలో కలపడం జరిగింది. ప్రతి గ్రామానికి తిరిగి గోకవరం మండలం కాకినాడ జిల్లాలో వద్దు రాజమండ్రి జిల్లాలో కలపాలని జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గం ఇంచార్జ్ పాటంశెట్టి సూర్య చంద్ర సంతకాలు సేకరించి శనివారం ఫిబ్రవరి 26 తారీకు నాటికి సుమారుగా 7000 సంతకాలు సేకరించి గోకవరం మండలం ఎమ్మార్వో గారికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-26-at-7.25.58-PM-1024x618.jpeg)