గొల్లప్రోలు జనసైనికులతో పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు నందు జనసైనికుల ఆహ్వానం మేరకు జనసేన నాయకులు డాక్టర్ శ్రీధర్ పిల్లా ఆదివారం సాయంత్రం గొల్లప్రోలులో కరణంగారి తోటనందు అరవై మంది జనసైనికులను కలవడం జరిగింది. దీనిలో భాగంగా డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ మనందరం కలిసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను వారి ఆశయాలను ముందుకు తీసుకునివెళ్ళడానికి మనందరం కలసి పనిచేయాలని మరింత స్పీడ్ తో ముందుకు వెళ్లాలని సూచించారు.