పలు కుటుంబాలను పరామర్శించిన పితాని

ముమ్మిడివరం: రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ కమిటీ సభ్యులు, ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జి పితాని బాలకృష్ణ కాట్రేనికోన మండలం, కుండలేశ్వరం గ్రామంలో అనారోగ్యంతో మరణించిన మాజీ సర్పంచ్ గంగు మల్లయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం వేట్లపాలెం గ్రామానికి చెందిన అనారోగ్యంతో మరణించిన వాకపల్లి రాజారావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. మరియు దొంతుకూరు గ్రామంలో హార్ట్ ఎటాక్ తో మరణించిన కముజు నాగేశ్వరావు(అబ్బులు) వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీరి వెంట మండల అధ్యక్షులు మోకా బాల ప్రసాద్, సంసాని పాండురంగ, బీమాల సూరి నాయుడు, గిడ్డి రత్నశ్రీ, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.