శెట్టిబలిజ కమ్యూనిటీ హాలు ప్రారంభోత్సవంలో పాల్గొన్న పితాని

ముమ్మిడివరం, ఎదుర్లంక గ్రామంలో నూతనంగా నిర్మించినటువంటి శెట్టిబలిజ కమ్యూనిటీ హాలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర జనసేన పార్టీ పిఎసి సభ్యులు మరియు ముమ్మిడివరం జనసేన పార్టీ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ జక్కంశెట్టి బాలకృష్ణ, జిల్లా ఉపాద్యక్షులు సానబోయిన మల్లికార్జునరావు, దూడల స్వామి, పితాని రాజు, గుద్దటి విజయ్, కడలి కొండ మరియు శెట్టిబలిజ యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.