మంచినీటి పైపులను బాగుచేయించిన పోట్నూరు లక్ష్మునాయుడు

ఎచ్చెర్ల నియోజకవర్గం: రణస్థలం మండలం, కృష్ణాపురం గ్రామంలో చాలా రోజులు నుండి మంచినీటి పైపులు లీకు అవుతూ ఉన్నాయి ఈ సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యపై స్పందించిన జనసేన పార్టీ నాయకులు పోట్నూరు లక్ష్మునాయుడు ఆదివారం కృష్ణాపురం పంచాయతీ దగ్గర ఉండి పైపులు బాగుచేయించి, ప్రజలకు నీరు ఇవ్వడం జరుగుతుంది. చాలా చోట్లు పైపు లీకులు ఉన్నాయి వాటి ద్వారా పురుగులు రావడం జరుగుతుంది. ఆ గ్రామం మధ్యలో నీరు నిల్వ ఉంటుంది. దీని ద్వారా ఈగలు, దోమలు చేరి ఆనీరు త్రాగడం ద్వారా మలేరియా విషజ్వరాలు రావడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ప్రతి ఇంటి ఇంటికి మంచినీరు కోళాయి మంజూరు చేయాలని, కాలువులు కూడా మంజూరు చేయాలని జనసేన పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.