8 కొత్త రైళ్లను ప్రారంభించిన ప్రధాని

ఈరోజు ప్రధాని నరేంద్రమోడీ.. దేశంలో 8 కొత్త రైళ్లను ప్రారంభించారు. కరోనా కారణంగా మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రైళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. కాగా, కొత్తగా ప్రారంభమైన ఈ ఎనిమిది రైళ్లు గుజరాత్‌లోని కెవాడియా పట్టణం నుంచి దేశంలోని ఎనిమిది ప్రాంతాలకు రాకపోకలు సాగించనున్నాయి. గుజరాత్‌లోని కెవాడియా పట్టణంలోనే స్టాట్యూ ఆఫ్ యూనిటీకి హోమ్‌టౌన్‌గా ఉన్నది. సర్దార్ వల్లభాయ్ పటేల్ 143వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని మోడీ.. 2018 అక్టోబర్‌లో పటేల్ భారీ విగ్రహమైన స్టాట్యూ ఆఫ్ లిబర్టీని ఆవిష్కరించారు. కాగా, కొత్తగా ప్రారంభమైన ఈ ఎనిమిది రైళ్లు కెవాడియా-వారణాసి, కెవాడియా-దాదర్‌, కెవాడియా-అహ్మదాబాద్‌, కెవాడియా-హజ్రత్‌, కెవాడియా-నిజాముద్దీన్‌, కెవాడియా-రేవా, కెవాడియా-చెన్నై, కెవాడియా-ప్రతాప్‌నగర్ మధ్య రాకపోకలు సాగించనున్నాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్‌, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.