తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన పృథ్వీరాజ్

టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ పృథ్వి తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. పది రోజుల నుంచి తీవ్ర జ్వరం, జలుబు లక్షణాలతో బాధపడుతున్నారు. దీంతో సోమవారం రాత్రి హస్పిట‌ల్‌లో జాయిన్ అయ్యారు. తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ పృథ్వి తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు.

గత 10 రోజులుగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నానని, జలుబు తీవ్రంగా ఉండటంతో అన్ని టెస్టులు చేయించుకున్నానని పృథ్వీరాజ్ అన్నారు. అయితే ఆ టెస్టుల్లో కోవిడ్ నెగెటివ్ అని వచ్చినప్పటికీ ఓ 15 రోజులు క్వారంటైన్‌లో జాయిన్ అవ్వండి అని డాక్టర్లు చెప్పడంతో నిన్న అర్థరాత్రి ఆసుపత్రిలో చేరానని అన్నారు. త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానని అన్నారు. ఈ మేరకు మీ అందరి ఆశీర్వాదం, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు. అయితే ఈ వీడియోలో ఆయన కనిపిస్తున్న కండీషన్ చూస్తుంటే కాస్త ఇబ్బందికర పరిస్థితే ఉందని తెలుస్తోంది.