చంచల్ గూడ జైలు వద్ద దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్ బస్సు..

నగరంలోని పాతబస్తీ చంచల్ గూడ జైలు ప్రధాన గేట్ ముందు నిలిపిన ఓ ప్రైవేట్ ఒక ప్రైవేటు బస్సు దగ్ధమైంది. బస్సులో ఆకస్మాత్తుగా మంటలు రేగడంతో గుమిగూడిన జనం పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.  సమాచారం అందిన వెంటనే మాదన్నపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కాగా బస్సులో మంటలకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే, బస్సును ఎవరో కావాలనే తగులబెట్టారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.