ఇకపై ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరిగితే సహించేది లేదు: చట్టాల త్రినాధ్

ప్రత్తిపాడు: జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పిలుపు మేరకు శనివారం ప్రత్తిపాడు నియోజకవర్గం, పెదనందిపాడు మండలంలో అడబిడ్డల పై జరుగుతున్న అత్యాచారాలపై నిరసన తెలిపడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా సంయుక్త కార్యదర్శి చట్టాల త్రినాధ్ మాట్లాడుతూ దిశ చట్టం పేరుతో ప్రజల్ని ప్రభుత్వం మభ్య పెడుతుంది అని ఇకపై అలా జరిగితే రోడ్లు ఎక్కి నిరసన తెలియ చేస్తాం అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లీగల్ సెల్ నెంబర్ యుంగంధర్ మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం దొంగ హామీలు ఇచ్చి అధికారం లోకి వచ్చి ప్రజల్ని మోసం చేస్తోందని అన్నారు. తదనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో వినతిపత్రం అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి డేగల లక్ష్మణ్, మండల అధ్యక్షులు పత్తి భవన్నారాయణ, కొల్లా గోపి, గడ్డం శ్రీను, మక్కె సురేష్ మరియు మండల నాయకులు పాల్గొన్నారు.