పెంచిన బస్ చార్జీలను తగ్గించకపోతే నిరసనలు తీవ్రతరం చేస్తాం: పత్తి చంద్రశేఖర్

శ్రీ సత్య సాయి జిల్లా, పుట్టపర్తి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని, ప్రజలపై బారాన్ని తగ్గించాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తి చంద్రశేఖర్ పుట్టపర్తి బస్టాండ్ ఆవరణలో నిరసన వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన తెలిపి.. ఆర్టీసీ అధికారులకు వినతిపత్రం అందించడం జరిగింది. బస్ చార్జీలను తగ్గించకపోతే జనసేన పార్టీ తరపున నిరసనలు తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్, జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, కొత్తచెరువు మండల కన్వీనర్ శివప్రసాద్, మోకా విజయ్ కాంత్, గోవర్ధన్, సల్లప్ప, మారుతి, కుర్మనాయకులు, మరియు జన సైనికులు పాల్గొన్నారు.