కౌలు రైతులకు సాగుదారు హక్కు కార్డు కల్పించండి: కడపజిల్లా జనసేన

కడపజిల్లా లో కౌలు రైతులకు సాగుదారు హక్కు కార్డు కల్పించాలని స్థానిక ఎమ్మెల్యే లను ప్రశ్నిస్తూ రాజంపేట, ఒంటిమిట్ట, బాకరాపేట, కమలాపురం, బద్వేలు జాతీయ రహదారుల పై ఫ్లెక్సీ లు ఉంచడం జరిగింది. ఈ విధంగా రైతులను ఆదుకుంటూ.. గ్రామాల్లో కి పార్టీని తీసుకుపోవడం ఇది మంచి పరిణామం. ఈ ఆలోచన కమలాపురం జనసేన నాయకులు వేణుగోపాల్ రెడ్డి కి రావడం దానిని రాజంపేట, బద్వేలు నియోజకవర్గ నాయకులు హరిరాయల్, బసవి రమేష్ తో పంచుకోవడం మంచి శుభపరిణామం.
ఈ ఫ్లెక్సీల ను దగ్గర ఉండి సిధ్ధవటం మండల నాయకులు కొట్టే. రాజేష్ ఆధ్వర్యంలో రహదారుల పై ఏర్పాటు చేయడం అభినందనీయం. చూస్తున్న ప్రజలు ఈ కార్యక్రమం మంచింది మా కౌలు రైతులకు ఈ జనసేన పార్టీ ఆలోచించడం సంతోషంగా వుందని ఆ నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి ఆలోచన తీసుకుని వచ్చిన కమలాపురం జనసేన నాయకులు వేణుగోపాల్ రెడ్డి కి కడపజిల్లా లోని జనసైనికులు, నాయకులు అభినందనలు తెలియజేస్తున్నారు.