ప్రమాదానికి గురైన జనసైనికునికి ఇన్సూరెన్స్ అందజేత

రాజోలు, మత్స్యకార అభ్యున్నతి యాత్రలో భాగంగా రాజోలు నియోజకవర్గం చింతలపల్లి గ్రామానికి చెందిన క్రియాశీలక కార్యకర్త సోమిశెట్టి శ్రీనుకు ప్రమాదవశాత్తు గాయపడి వారిని పరామర్శించి జనసేన పార్టీ తరఫున వారికి వర్తించే మెడికల్ ఇన్సూరెన్స్ చెక్కును 50,000 పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్, జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ లు రాజోలు వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజు చేతులమీదుగా అందచేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో మలికిపురం మండలం ఎంపీపీ మేడిచర్ల సత్యవాణి, రాజోలు జనసేన పార్టీ మండల అధ్యక్షుడు సూరిశెట్టి శ్రీను, గడ్డం మహాలక్ష్మి ప్రసాద్, పినిశెట్టి బుజ్జి పాల్గొన్నారు.