అరుంధతి కాలనీలో ప్రజా చైతన్య పోరాటం యాత్ర

కాకినాడ సిటీ, జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు కాకినాడ సిటీ ఇంచార్జ్ ముత్తా శశిధర్ సూచనలతో దూలపల్లి ఉమ ఆధ్వర్యంలో రేచర్ల పేటలోని అరుంధతి కాలనీలో ప్రజా చైతన్య పోరాటం యాత్ర జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ శ్రేణులు ప్రజలను కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తూ ఈ వై.సి.పి ప్రభుత్వం అన్యాయాలపై ప్రజలను జాగృతం చేసారు. ఈ ముఖ్యమంత్రి పాలనలో దళితుల బ్రతుకులకు భరోసాలేదనీ, ప్రచారానికి మాత్రం జగనన్న భరోసా, రైతు భరోసా లాంటి నినాదాలు మాత్రం అపరిమితమని విమర్శించారు. ఒకవేళ మేము చెబుతున్నది నిజం కాకపోతే గుంటూరు జిల్లా దగ్గర దళిత యువకుడిపైన జరిగిన దౌర్జన్యానికి ఏమి సమాధానం చెపుతారని డిమాండ్ చేసారు. దళితులపై దాష్టీకాలు, అత్యాచారాలు చేస్తూ తిరిగి నిస్సిగ్గుగా సాధికార యాత్రలు జరిపే ఈ వై.సి.పి ప్రభుత్వ కుటిల రాజకీయాన్ని జనసేన పార్టీ ఖండిస్తోందన్నారు. ప్రజా చైతన్యమే ఈ దుర్మార్గ పాలనకి సమాధానమని ఆదిశగా తాము కృషిచేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిటి సహాయకార్యదర్శి కాంటా రవిశంకర్, పచ్చిపాల మధు, బండి సుజాత, మరియ, దీప్తి, రమణమ్మ, ఉమా, సోనీ ఫ్లోరెన్స్ తదితరులు పాల్గొన్నారు.