టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్

ఐపీఎల్ 2020 లో ఈ రోజు రెండో మ్యాచ్ దుబాయ్ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతుంది. అయితే అందులో టాస్ గెలిచిన పంజాబ్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక ఈ ఏడాదే కెప్టెన్ గా బాధ్యతలు చేప్పట్టిన రాహుల్ తన జట్టును ఎలా ముందుకు నడిపిస్తాడు అనేది మాజీ ఆటగాళ్లతో పాటుగా అభిమానులు కూడా చూడాలనుకుంటున్నారు. పంజాబ్ జట్టులో ఉన్న సూపర్ హిట్టర్ గేల్ ఈ మ్యాచ్ లో ఆడటం లేదు. ఇక ఇంతకముందు పాంటింగ్ చెప్పిన విధంగానే రహానేకు ఢిల్లీ తుది జట్టులో స్థానం దక్కలేదు. అలాగే గాయం కారణంగా ఇషాంత్ శర్మ కూడా ఈ మ్యాచ్ కు దూరం అయ్యాడు.