గడప గడపకు వైసీపీ అని వచ్చే నాయకులను ప్రజలు అడగవలసిన ప్రశ్నలు
*మాదాల శ్రీరాములు అరకు నియోజకవర్గం సమన్వయకమిటీ సభ్యులు
- ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ఎక్కడ ?
- మద్యపాన నిషేధం ఎక్కడ? నాసిరకం మద్యం ఎందుకు అమ్ముతున్నారు?
- ప్రత్యేక హోదా ఎక్కడ ?
- ఇసుక ధరలు ఎందుకు పెంచారు ?
- పోలవరం ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటీ?
- గుంతల రోడ్ల పరిస్థితి ఏంటి ?
- కడప స్టీల్ ప్లాంట్ ఎక్కడ?
- కొత్త పరిశ్రమలు ఎక్కడ?
- జాబ్ క్యాలెండర్ ఎక్కడ ?
- కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులేషన్ ఎక్కడ?
- సి.పి.ఎస్ రద్దు పరిస్థితి ఏంటి?
- కార్పొరేషన్ లోన్స్ ఎందుకు ఇవ్వటం లేదు ?
- పేదల ఇంటి బిల్లులు ఎందుకు ఇవ్వటం లేదు?
- కరెంట్ కోతలు ఎందుకు ? కరెంటు బిల్లులు ఎందుకు పెంచారు ?
- ఆర్టీసీ ఛార్జీలు ఎందుకు పెంచారు!
- నిత్య అవసరాల ధరలు ఎందుకు పెరుగుతున్నాయి ? ఎందుకు ధరలు అదుపు చేయలేక పోయారు?
17.పెట్రోలు, డీజిల్, సిమెంట్, స్టీల్ ధరలు ఎందుకు విపరీతంగా పెంచారు? - పేదల కోసం పెట్టిన అన్నా క్యాంటీన్ ఎందుకు మూసివేశారు?
- నిరుద్యోగ భృతి ఎందుకు నిలిపివేశారు ?
- పేదల కోసం ఇచ్చే పెళ్ళికానుక ఎందుకు ఆపారు?
- ఎన్.ఎస్.డి.సి లోన్స్ ఎందుకు ఆపారు?
- చంద్రన్న భీమా లేదా వైఎస్సార్ భీమా ఎక్కడ?
- రేషన్ ద్వారా సన్న బియ్యం ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వటం లేదు?
- ఎస్సీ, ఎస్టీ మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వటం లేదు?
- తెలుగు రాష్ట్రంలో తెలుగు భాష లేకుండా ఎందుకు చేయబోతున్నారు?
- అభయ హస్తం డబ్బులు ఎక్కడా ?
27 టిడ్కో ఇళ్ళు 3 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదు? ఇంకెప్పుడిస్తావ్? అసలిస్తావా? ఇవ్వవా? నీఉద్దేశ్యం ఏంటి? ఎన్నికలకు ప్రచారం కోసం వాడుకుంటావా? - ఎయిడెడ్ విద్యాసంస్థల పరిస్థితి ఏంటి? చేతకానప్పుడు ఎందుకు టచ్ చేశావ్?
- రైల్వేజోన్, పులిచింతల, హంద్రీనీవా, పోలవరం, ఇవన్నీ నీవల్ల అవుతాయని ఇంకా జనాన్ని నమ్మిస్తావా?
గడప గడపకి వైఎస్సార్సీపీ పేరుతో మీ ఇంటికి వచ్చిన ప్రతి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని , ప్రతీ వైఎస్సార్సీపీ నాయకున్నీ కాలర్ పట్టుకుని అడగండి..అని అరకు నియోజకవర్గం సమన్వయకమిటీ సభ్యులు మాదాల శ్రీరాములు తెలియ జేశారు.