కరెంటు చార్జీలు తగ్గించాలంటూ రాజోలు జనసేన నిరసన

రాజోలు, పెరిగిన కరెంటు చార్జీలు తగ్గించాలంటూ రాజోలు జనసేన నాయకులు శనివారం నిరసన తెలిపారు. అనంతరం రాజోలు నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాజోలు విద్యుత్ శాఖ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో అనేక అదనపు చార్జీల రూపంలో కరెంటు బిల్లులు అధికమయ్యాయని అన్నారు. ఈ కరెంటు బిల్స్ సామాన్యుడికి షాక్ కొడుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు, రాపాక రమేష్ బాబు, గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్, మండలం ఎంపీపీలు, మండల అధ్యక్షులు, సర్పంచ్ లు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.