విశాఖ ఉక్కు కోసం ర్యాలీ.. ఉక్కు పరిరక్షణ సమితి వేదిక..

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా సంతకాలను సేకరిస్తామని విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి వేదిక పేర్కొంది. విజయవాడలో విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి సభ్యులు శనివారం మీడియాతో మాట్లాడారు. 14న బైక్‌ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. గుంటూరు నుంచి విజయవాడ మీదుగా విశాఖకు ఈ బైక్‌ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. విజయవాడలో బహిరంగ సభ అనంతరం బైక్‌ ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు. అనేక మంది పోరాటాల తర్వాత విశాఖ ఉక్కు పరిశ్రమ ఏర్పాటైందన్నారు. ఆంధ్ర ప్రజలను కేంద్రం కావాలనే మోసగిస్తోందని, పోరాటాన్ని మరింత ముందుకు వెళ్లనున్నామన్నారు.