రత్నమ్మ మృతికి నివాళులు అర్పించిన రామ శ్రీనివాస్
రాజంపేట: రాజంపేట పట్టణ పరిధిలో కొలువీధి నివాసి మరియు జనసేన పార్టీ రాజంపేట పట్టణ నాయకుడు పలుకూరి శంకర్ మాతృమూర్తి రత్నమ్మ మృతి చెందిన విషయం తెలుసుకున్న రాజంపేట అసంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్ స్వగృహం నందు ఆమె మృతదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక జనసేన నాయకులతో కలిసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో అబ్బిగారి గోపాల్, లతీఫ్, ప్రతాప్, మళ్ళీ, ఆచారి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-03-at-7.28.49-PM-768x1024.jpeg)