దేవి కుటుంబాన్ని పరామర్శించిన రామ శ్రీనివాస్

అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గ పరిధిలోని టి. సుండుపల్లి మండల పరిధిలో పెద్దహరిజనవాడ భాపనపల్లిలో నివాసముంటున్న బాలనగాళ్ళ నాగయ్య, ఓబులమ్మల కుమార్తె టి.సుండుపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ లో 7 వ తరగతి చదువుతున్న దేవి షుగర్ వ్యాధి బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలుసుకున్న జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ అక్కడికి వెళ్లి భౌతికకాయాన్ని సందర్శించి వారి తల్లిదండ్రులను ఓదార్చి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా రామ శ్రీనివాస్ మాట్లాడుతూ… పిల్లల పట్ల తల్లిదండ్రులు తమ తమ బాధ్యతలు గుర్తు చేస్తూ ఆరోగ్య విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి, అలానే సమాజంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లలు పట్ల బాధ్యతగా ఉండాలి మరియు చదువుకునే విద్యార్థులు పట్ల విద్యావంతులు కూడా వారికి ఆహారం, ఆరోగ్యం పట్ల అలవాట్లు కూడా ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని మంచి అలవాట్లు నేర్పేందుకు స్కూలుకు సంబంధించిన ఉపాద్యాయులు కూడా వారికి ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు పిల్లలకు వివిధ మాధ్యమాల్లో తెలియపర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని రామ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, గ్రామస్తులు, ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు.