అన్నమయ్య జిల్లా ఎస్పిని మర్యాదపూర్వకంగా కలిసిన రామ శ్రీనివాస్

అన్నమయ్య జిల్లా ఎస్పిగా ఇటీవల కాలంలో నూతనంగా నియామకమై భాద్యతలు చేపట్టిన తర్వాత ఆర్ గంగాధర్ రావు ఐపియస్ ని జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసి జిల్లాలో రాజకీయాలకు అతీతంగా శాంతి భద్రతల కోసం అలుపెరుగని కృషి చేయాలని, అదేవిధంగా ప్రజలందరికీ మీ సర్వీస్ అందుబాటులో ఉండాలని, జిల్లా వ్యాప్తంగా మీ సేవలు శాంతియుతంగా అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన ఉమ్మడి జిల్లా మాజీ సోషల్ జస్టీస్ సభ్యుడు షేక్ సలీమ్, జనసైనికులు యువత పాల్గొన్నారు.