తిరుమల 15వ మహా పాదయాత్రలో పాల్గొన్న రామ శ్రీనివాస్

రాజంపేట: అన్నమయ్య జిల్లా, రాజంపేట నియోజకవర్గ పరిధిలోని టి. సుండుపల్లి స్థానిక మండల కేంద్రం శివాలయం నుంచి మండల వ్యాప్తంగా దాదాపు 1000 మంది గోవిందు స్వామి మాలలతో తిరుమల 15వ మహా పాదయాత్ర సందర్భంగా గోవిందు స్వామి కమిటీ సభ్యులు మరియు వెంకటేశ్వర స్వామి భక్తులతో కలిసి మహా పాదయాత్ర కార్యక్రమంలో.. జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మరియు టీడీపీ రాజంపేట పార్లమెంట్ వాణిజ్య విభాగ అధికార ప్రతినిధి ఎం దామోదర్ నాయుడు, మాజీ ఎంపీటీసీ రామచంద్ర, నాగేశ్వర, సుబ్బరాజు, మేస్ట్రీ వెంకటరమణ, ప్రవీణ్, శివ, గురయ్య, కృష్ణయ్య, రామంజులు రాజకీయ నాయకులు, ప్రజాసంఘాల నేతలు, గోవిందు స్వామి భక్తులు, మండలంలోని నలు వైపులా నుంచి మండల వ్యాప్తంగా ప్రజలందరూ భారీ ఎత్తున పాల్గొన్నారు.