నెల్లూరు జనసేన ఆధ్వర్యంలో ముస్లింలకు రంజాన్ తోఫా

నెల్లూరు నగరంలోని స్థానిక ఐదవ డివిజన్ బోడిగాడి తోట ప్రాంతంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ముస్లింలకు రంజాన్ పండుగ సందర్భంగా జనసేన పార్టీ నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో పేద ముస్లింలకు చీరలు, నిత్యవసర సరుకులు, బియ్యం తదితర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు, చిరంజీవి యువత అధ్యక్షులు సురేష్, వెంకటేష్, రమేష్, వెంకట్రావు, రవి తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.