వరుస సినిమాలతో బిజీ అవుతున్న రానా

పెళ్లి వేడుకలతో బ్రేక్ లో ఉన్న టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా త్వరలో షూటింగ్స్ స్టార్ట్ చేయబోతున్నాడు. మొదట విరాట పర్వం సినిమాను పూర్తి చేయనున్న రానా, ఆ తర్వాత హిరణ్య కశ్యప మూవీ సెట్స్ పైకి వెళ్తుంది. గుణశేఖర్ దర్శకత్వం వహించబోయే హిరణ్య కశ్యప మూవీ భారీ బడ్జెట్ సినిమాగా తెలుస్తోంది. ఇక కొంతకాలంగా గృహం ఫేమ్ మిలింద్ తో మరో సినిమా చర్చల దశలో ఉండగా. ఇటీవలే ఫుల్ స్క్రిప్ట్ విన్న రానా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ మూవీ తెలుగు, తమిళ్ తో పాటు హిందీలో షూట్ చేయనున్నారు. నిర్మాతలు సురేష్ బాబు, ఆచంట గోపినాథ్ లు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసి, ఆ తర్వాత హిరణ్య కశ్యపకు ఫుల్ టైం కేటాయించనున్నారని ఇండస్ట్రీ టాక్. మరి ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవముందనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.