కూకట్పల్లిలో రంగా జయంతి వేడుకలు

కూకట్పల్లి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన రంగా 75వ జయంతి ఉత్సవాలు కూకట్పల్లి నియోజకవర్గం కేపీహెచ్బీ కాలనీ రమ్య గ్రౌండ్ వద్ద రంగా అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి వీరాభిమాని అయిన భగవాన్ కేకు కట్ చేయడం జరిగినది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంగవీటి మోహన రంగా బడుగు, బలహీన వర్గాలకు వెన్నంటు ఉండి, బడుగుల సమస్యలపై పోరాడిన గొప్ప వ్యక్తి మోహనరంగా అని, వారి ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని అన్నారు. పేదల మనిషి అని ఆపదలో ఉన్నవారిని ఆదుకునే వాడని అలాంటి నాయకుడు ఇప్పటి వరకు ఎవరూ రాలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ నాయకులు రంగా అభిమానులు కొల్లా శంకర్, మండలి దయాకర్, అంజి, అడుసుమల్లి వెంకటేశ్వరరావు, గంధం రాజు, తోట రమేష్, హైటెక్ శ్రీనివాస్, తుమ్మల మోహన్ కుమార్, భరత్, ఎల్ రాజా, నాగేశ్వరరావు, పసుపులేటి ప్రసాద్, కొత్తపల్లి సుబ్బారావు మరియు భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.